వేదాద్రి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. అప్పటి నుంచే..

by Web Desk |
వేదాద్రి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. అప్పటి నుంచే..
X

దిశ, తలకొండపల్లి : వెల్జాల్ గ్రామంలో శనివారం నుంచి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 19-2-2020 శనివారం రోజున స్వామి వారికి లక్ష పుష్పార్చన, 20-2-2022 ఆదివారం ఉదయం 11 గంటలకు లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా 21-2-2022 సోమవారం రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమం సమాప్తం జరుగుతుంది. అనంతరం మహా నీరాజనం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. కావున వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.


Next Story