ఆ రెండు జిల్లాల్లో మద్యం టెండర్లకు స్పందన కరువు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-07 01:55:03  IST  )

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 249 దుకాణాలకు, వికారాబాద్‌ జిల్లాలోని 59 దుకాణాల కోసం ఎక్సైజ్‌ శాఖ టెండర్లు పిలవగా.. సోమవారం నాటికి 268 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి

ఆ రెండు జిల్లాల్లో మద్యం టెండర్లకు స్పందన కరువు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 249 దుకాణాలకు, వికారాబాద్‌ జిల్లాలోని 59 దుకాణాల కోసం ఎక్సైజ్‌ శాఖ టెండర్లు పిలవగా.. సోమవారం నాటికి 268 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తుకు ఎక్కువ సమయం ఇవ్వడం.. మధ్యలో దసరా రావడంతో వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు ముందుకు రాలేదు. ముహూర్తాలు సైతం చూసుకొని కొందరు దరఖాస్తు చేసే పనిలో ఉన్నారు. ఎప్పటిలాగే గడువుకు మూడు, నాలుగు రోజుల ముందు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ చెప్తోంది. ప్రతిసారి వ్యాపారులు సిండికేట్ మద్యం షాపులకు దరఖాస్తు చేస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదే రీతిలో దరఖాస్తులు వేసి షాపులను దక్కించుకోవాలని వ్యాపారులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రూపులుగా ఏర్పడి టెండర్లు?

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలో గతంలో 472 మంది ఒక గ్రూపుగా ఏర్పడి షాపులకు టెండర్లు వేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షల చొప్పున వసూలు చేశారు. టెండర్లలో వీరి కి మొత్తం ఐదు షాపులు దక్కగా.. వాటిల్లో 472 మందిని భాగస్వాములుగా ఉన్నారు. సింగిల్‌‌గా దరఖాస్తు చేస్తే డ్రాలో షాపు ద క్కకపోతే ఒక్కో దరఖాస్తుకు చెల్లించే రుసుము కోల్పోవాల్సి వస్తోంది. అదే గ్రూపు గా ఏర్పడితే భాగస్వామ్యం అయినా దక్కుతుందన్నది వ్యాపారుల ఆలోచన. ఈ క్ర మంలో ఈసారి వ్యాపారులు అవే ఎత్తుగడ లు వేస్తున్నారు.

ఒక్కో గ్రూప్ లో 5 నుంచి 20 మంది వరకు ఉంటుండగా.. కొన్ని చోట్ల వందల సంఖ్యలో గ్రూపుగా ఏర్పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రూ.3లక్షలకు పెంచింది. రుసుము కూడా ఎక్కువగా ఉండటంతో చాలా మంది గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సిండికేట్‌ గా ఏర్పడి దరఖాస్తులు వేయడం వల్ల ఒక చోట కాక పోతే మరోచోట కలిసి వస్తుందనే వ్యూహం తో వ్యాపారులు ముందుకెళ్తున్నారు.

వచ్చింది 268 మాత్రమే

సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో ఉన్న 138 దుకాణాలకు గాను 25 దుకాణాలను గౌడ్‌లకు, 11 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. శంషాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో ఉన్న 111 దుకాణాలకు 9 షాపులను గౌడలకు, ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. గత సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబరు 18వ వరకు స్వీకరిం చి 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయనున్నారు. ఈ 11 రోజుల వ్యవధిలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో 268 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

సరూర్‌ నగ ర్‌ పరిధిలో 54 దరఖాస్తులు రాగా.. శం షాబాద్‌ పరిధిలో అధికంగా 212 దరఖాస్తులు వచ్చాయి. ఇక వికారాబాద్‌ జిల్లాలో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వ చ్చాయి. దసరా పండుగ తర్వాత దరఖాస్తు లు వేద్దాం! అన్న ఆలోచనతో చాలామంది ముందుకు రాలేదు. కొందరు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. గ తంలో నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుం చి దరఖాస్తులకు 10 నుంచి 12 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. కానీ.. ఈసారి దాదాపు 23 రోజుల పాటు గడువు ఇవ్వడం వల్ల కూడా.. ఇంకా టైం ఉంది కదా? అన్న భావనలో చాలా మంది ఉన్నారు.

చివరి రోజుల్లో పెరగనున్న దరఖాస్తులు

దరఖాస్తులకు చివరి గడువు ఈనెల 18కాగా.. చివరి మూడు, నాలుగు రోజుల ముందు దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఇదే తీరుగా వ్యాపారులు పెద్ద ఎత్తున సమర్పించిన ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. 2023-25 లో రంగారెడ్డి జిల్లాలో 234 షాపులకు 21,615 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుతోపాటు చెల్లించిన రూ. 2 లక్షల రుసుముతో ప్రభుత్వ ఖజానాకు రూ. 432.3 కోట్ల ఆదాయం సమకూరింది. సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో ఇబ్రహీంపట్నం, మ హేశ్వరం, ఆమనల్లు, షాద్‌ నగర్‌, సరూర్‌ నగర్‌, హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ డివిజన్ల పరిధిలో134 షాపులు ఉండగా మొత్తం 10,994 దరఖాస్తులు వచ్చాయి. శంషా బాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో చేవెళ్ల, శంషాబాద్‌, శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ డివిజన్ల పరిధిలో 100 షాపులు ఉండగా మొత్తం 10,621 దరఖాస్తులు వచ్చాయి.

మణికొండ పరిధిలోని ఓ వైన్‌ షాపునకు ఏకంగా 185 దరఖాస్తులు రాగా.. నార్సింగిలోని ఓ వైన్‌ షాపునకు 163 దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్‌ జిల్లాలోని 59 షాపులకు 2,637 దరఖాస్తులు వచ్చాయి. నవాబ్‌ పేట్‌‌లోని వైన్‌ షాపునకు ఏకంగా 95 దరఖాస్తులు రాగా.. వికారాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 15 దు కాణాలకు 866 దరఖాస్తులు, తాండూరు సర్కిల్‌ పరిధిలోని 18 దుకాణాలకు 583 దరఖాస్తులు, పరిగి సర్కిల్‌ పరిధిలోని 12 దుకాణాలకు 564 దరఖాస్తులు, మోమిన్‌‌పేట్‌ సర్కిల్‌ పరిధిలోని 6 దుకాణాలకు 349, కొడంగల్‌ సర్కిల్‌ పరిధిలోని 8 దుకాణాలకు 275 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు ఉండటం.. ఆ తర్వాత మున్సిపల్‌, కార్పొరేషన్ల ఎన్నికలు జరగనుండడంతో టెండర్లకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Next Story