సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే: ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

by Disha Web Desk 11 |
సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దే: ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
X

దిశ, పరిగి: వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తూ సాగుకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. పరిగిలో సోమవారం దశాబ్ది వారోత్సవాల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని ఎస్ గార్డెన్స్ లో పరిగి డిస్కం ఏడీ రాంమూర్తి అధ్యక్షతన విద్యుత్ ప్రగతి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ పండగలా మార్చారన్నారు.

వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ తరుణ్​ కుమార్​, అధికారులు దీపారెడ్డి, సుధారాణి, ఉపేందర్​, ఎంపీడీఓ శేషగిరి శర్మ, జయరాం, ఉమాదేవి, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి విజయ్​ కుమార్​, జెడ్పీటీసీలు నాగిరెడ్డి, బేతు హరిప్రియ, మేఘమాల, రాందాస్​, ఎంపీపీలు మల్లేషం, పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ శివన్నోళ్ల భాస్కర్​, వైస్​ ఎంపీపీ కావలి సత్యనారాయణ,బేతు ప్రవీణ్​ కుమార్​ రెడ్డి, కౌన్సిలర్లు వారాల రవీంద్రా, ఎదిరె కృష్ణ, నాగేశ్వర్​, మౌలానా, వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed