ఎమ్మెల్యే సారూ.. ఇచ్చిన హామీ ఏమాయె : జేఏసీ నాయకులు

by Disha Web Desk 20 |
ఎమ్మెల్యే సారూ.. ఇచ్చిన హామీ ఏమాయె : జేఏసీ నాయకులు
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని గట్టిప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును జేఏసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో ముట్టడించారు. గతేడాది గ్రామాన్ని మండలంగా గుర్తించాలని 41 రోజుల పాటు దీక్ష చేస్తే ఆ దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే హాజరయ్యారని జేఏసీ నాయకులు తెలిపారు.

మొదటగా మీ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే విధంగా చూస్తానని అప్పట్లో హామీ ఇచ్చి దీక్షా శిబిరాన్ని విరమింప చేశారని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా వెల్జాల్ గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ స్వయాన ఎమ్మెల్యే అల్లుడు మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Next Story

Most Viewed