- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు.. రిమాండ్కు తరలింపు
అంతర్రాష్ట్ర కరుడుగట్టిన దొంగ వికాస్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.

16 ఏళ్ల మైనర్ వయసులోనే నేర జీవితం
*దొంగను ప్రోత్సహించిన బంగారం వ్యాపారుల ముఠా
దొంగిలించిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసర ప్రాంతాలు అయిన కుర్వర్ గంజేరి క్రింద ఉన్న బంగారం షాప్ యజమానులకు అమ్మ ద్వారా అమ్మేవాడని విచారణలో తేలింది అని తెలిపారు. ఇందులో బంగారం కొన్న వ్యాపారులు శ్యామ్ మోహన్ (బాబా శాలిక్ రామ్ బంగారం షాప్ యజమాని) నివాసం కుర్వర్ సుల్తాన్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ నివాసి అన్నారు. మరో వ్యాపారి సూరజ్ మోహన్ (బాబా శాలిక్ రామ్ బంగారం షాప్ యజమాని) నివాసం కుర్వర్ సుల్తాన్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ మూడో వ్యాపారి. అశోక్ సోని (అశోక్ సోని జెవెలర్స్ యజమాని) నివాసం కుర్వర్ సుల్తాన్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్. వికాస్ అగ్రహారి (వికాస్ జెవెలర్స్ స్టోర్ గంజేరీ నివాసం భగ్వాన్ పూర్ సుల్తాన్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మైనర్గా ఉన్నప్పుడు దొంగతనాలు చేసిన మాట వాస్తవమేనని అయితే తర్వాత ఈ బంగారం షాప్ యజమానులు దొంగసొమ్ము ద్వారా ఎక్కువ లాభాలు గడించడం అలవాటు పడి, ఇతర రాష్ట్రాలలో దొంగతనాలు చేసి తమకు బంగారం అమ్మితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తనను ప్రోత్సహించారని నిందితుడు ఒప్పుకున్నాడు అని అన్నారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా ముందే డబ్బులు ఇచ్చి మరి నేరాలకు పురికొల్పేవారని ఒకానొక దశలో తను దొంగతనాలు చేయడానికి భయపడితే పైన పేర్కొన్న యజమానులందరూ తలా రూ. 10,000 చొప్పున మొత్తం 40,000 రూపాయాలు ఇచ్చి అక్రమంగా తుపాకి కొనడానికి కూడా ప్రోత్సహించారని వారి ప్రోత్సాహం తోనే ఒక తుపాకీ కొనడం జరిగింది అని నిందితుడు సంచలన నిజాలు వెల్లడించాడు అన్నారు. నిందితునిపై పాత 34 కేసులు ఇప్పటి 27 కేసులు కలిపి మొత్తం 61 కేసులు నమోదయ్యాయని ఎస్పి తెలిపారు. తేదీ 26.06.2024 నుండి ఇప్పటి వరకు చేసిన నేరాలు ఒప్పుకున్న 27 కేసులలో నేరస్థున్ని అరెస్టు చేయడం జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం నిందితుని నుండి తులంన్నర బంగారం ఆభరణాలు ఒక తుపాకీ 5ఎంఎం పిస్తోల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ఎస్పీ వెల్లడించారు.
రిసీవర్లపై కఠిన చర్యలు ఎస్పి హెచ్చరిక:-
పైన పేర్కొన్న బంగారం దుకాణాల యజమానులందరూ ఒక సిండికేట్ (ఆర్గనైజర్లు) గా ఏర్పడి నిందితుడితో చేయి కలిపి దొంగతనాలు చేయిస్తున్నట్లు అక్రమంగా ఆయుధాలు కొనడానికి ప్రోత్సహించడం జరుగుతుంది అని దర్యాప్తులో తేలడంతో సదరు యజమానులపై కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్మ్స్ యాక్ట్ అలవాటు పడ్డ నేరస్తులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. అవసరమైతే వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. ఈ దొంగ సొమ్ము రిసీవర్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఒక సీనియర్ పోలీస్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు టీమ్ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది దొంగ సొత్తు స్వాధీనం చేసుకొని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అన్నారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని కాలనీలు గ్రామాల్లో ఎవరైనా గుర్తు తెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పి కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని సూచించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని భరోసా ఇస్తూ ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అత్యంత ప్రతిభావంతంగా,
చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, వారి సిబ్బందిని వికారాబాదు ఎస్పి స్నేహ మెహ్రా ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు.






