ఇబ్రహీంపట్నంలొ భారీ నగదు పట్టివేత

by Disha Web Desk 20 |
ఇబ్రహీంపట్నంలొ భారీ నగదు పట్టివేత
X

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మున్సిపల్ కేంద్రంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తపేట నుండి మునుగొడుకు డబ్బును తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో తనిఖీ చేయగా (TS 07 GA 8786) నెంబర్ గల మారుతీ ఎస్ క్రాస్ కార్లో అరవై నాలుగు లక్షల, అరవై మూడు వెయ్యిల రూపాయల నగదు దొరికింది.

వీరు కొత్తపేట, లక్ష్మీ నగర్ కి చెందిన అడ్వకేట్ వేణుమాధవ్ గా గుర్తించారు. వేణుమాధవ్, కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద తనిఖీ నిర్వహించారు. డబ్బుదొరకడంతో వారు పొంతనలేని సమాధానాలు తెలపడంతో డబ్బును సీజ్ చేసినట్లు ఇబ్రహీంపట్నం సీఐ రామకృష్ణ తెలియజేసారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed