కొద్ది నిమిషాల్లో ఇంటికి.. ఇంతలోనే ప్రమాదం.. మహిళ మృతి

by Disha Web Desk 11 |
కొద్ది నిమిషాల్లో ఇంటికి.. ఇంతలోనే ప్రమాదం.. మహిళ మృతి
X

దిశ, పరిగి: మరో కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయానికి మృత్యువు కబలించింది. వివరాల్లోకి వెళ్లితే.. దోమ మండలం దాదాపూర్​ గ్రామానికి చెందిన పూరి రమేష్​, అతని భార్య షుష్మ లు కొంతకాలంగా పరిగిలో నివాసం ఉంటున్నారు. హైదారాబాద్​ నుంచి పరిగికి బలేనో కారులో బుధవారం రాత్రి బయలుదేరారు. హైవే 163 రోడ్డుపై పూడూరు మండలం సోమన్​ గుర్తి గేటు వద్దకు రాగానే నిద్ర మత్తులో రమేష్​ కారు నడిపిస్తూ ఒక్కసారిగా ఎడమ వైపునకు స్టీరింగ్​ తిప్పాడు.

దీంతో పక్కనే ఉన్న ఓ హోటల్​ గోడను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్​ భార్య షుష్మకు తీవ్రగాయాలై అక్కిడికక్కడే మృతి చెందింది. రమేష్​, అతని కూతురు తనవి లకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించి గాయాలైన రమేష్​, తనవి లకు చికిత్స నిర్వహించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed