చోరీకి గురైన క్యాబ్​ను పట్టించిన జీపీఎస్​ యాప్..​

by Disha Web Desk 20 |
చోరీకి గురైన క్యాబ్​ను పట్టించిన జీపీఎస్​ యాప్..​
X

దిశ, బడంగ్​పేట్ :​ డ్రైవర్ ​పై కత్తితో దాడి చేసి ఓ దొంగ క్యాబ్​తో ఉడాయించాడు. ఈ ఘటనలో జీపీఎస్​ యాప్​ లో ఉన్న ఇంజన్​ కట్​ ఆఫ్ పహాడిషరీఫ్​ పోలీసులు క్యాబ్​ దొకికేలా చేసింది. పహాడిషరీఫ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్​బాగ్​, హఫీజ్​బాబానగర్​ కు చెందిన మీర్జా ఆజంబేగ్​ (21) వృత్తి రిత్యా క్యాబ్​ డ్రైవర్​. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్​ యాప్​లో వచ్చిన మెసేజ్​ప్రకారం టీఎస్​ 09 యు.డీ 4323 నెంబర్​ గల మారుతి కారులో మీర్జా ఆజంబేగ్​ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్​ వద్ద పికప్​ చేసుకున్నాడు.

అనంతరం శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ కు వస్తుండగా మార్గమధ్యలో ఎయిర్​ పోర్ట్​లో డ్రైవర్ ​పై కత్తితో దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు క్యాబ్​తో ఉడాయించారు. జరిగిన విషయాన్ని తన కారు యజమాని అజ్మత్​కు వివరించాడు. వెంటనే యజమాని జీపీఎస్​ యాప్​ ద్వారా చెక్​ చేయగా క్యాబ్​ బేగంబజార్​లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇంజన్​ కట్​ ఆఫ్​ చేయడంతో కారు బేగంబజార్​లోనే ఆగిపోయింది. వెంటనే కారును వదిలి నిందితులు పరారయ్యారు. లొకేషన్​ ద్వారా కారును గుర్తించిన పోలీసులు చోరీకి గురైన క్యాబ్​ను రీకవరీ చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story