సోలార్ కంపెనీ ని సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి..

by Taduka Kalyani |

షాబాద్ మండలం లోని సోలార్ కంపెనీని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, చేవెళ్ల ఏసీపీ కిషన్ లతో కలిసి సందర్శించి,

సోలార్ కంపెనీ ని సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి..
X

దిశ, షాబాద్: షాబాద్ మండలం లోని సోలార్ కంపెనీని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్, చేవెళ్ల ఏసీపీ కిషన్ లతో కలిసి సందర్శించి, ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీసి, కార్యక్రమం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు, కంపెనీ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ లు సతీష్, రమేష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story