తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో నాలుగేళ్ల బాలుడు మృతి

by Yella Dhawani Reddy |

తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో నాలుగేళ్ల బాలుడు మృతి
X

దిశ, జల్‌పల్లి: ఎలక్ర్టికల్ హీటర్‌తో వేడిచేస్తున్న నీటిలో చెయ్యి పెట్టిన నాలుగేళ్ల బాలుడు విద్యుత్​షాక్‌కు గురై మృతిచెందిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ బి.భాస్కర్ వివరాల ప్రకారం.. శుక్రవారం ఎర్రకుంటకు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్ ఇంట్లో మధ్యాహ్నం వేడినీటి కోసం ఎలక్ర్టికల్ హీటర్‌తో వేడి చేస్తున్నారు. అతని కుమారుడు మహహ్మద్ సుఫియాన్(4) ఆడుకుంటూ ఆ నీటిలో చెయ్యిపెట్టి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు సుఫియాన్‌ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story