వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

by Dishafeatures2 |
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం..  మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
X

దిశ, యాచారం: 2024లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర చేసిన ఆయన అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడితే.. బీఅర్ఎస్ పాలన అవినీతికి చిరునామాగా మారిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్హులైన పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గుండెమొని జయమ్మ, నాయకులు తాల్లపల్లి చిన్న , బోసుపల్లి వీరేషం, మంకాల దాసు , దర్శన్, తదితరులు పాల్గొన్నారు..


Next Story

Most Viewed