ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఏర్పాటు..

by Disha Web Desk 13 |
ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఏర్పాటు..
X

దిశ, ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్‌లు గురువారం ఎల్బీనగర్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజల సమస్యలను అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశంలో జేఏసీ తీర్మానించింది. అన్ని నియోజకవర్గాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇస్తున్న మాదిరిగానే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని జేఏసీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించనునట్లు జేఏసీ నాయకులు, జర్నలిస్టులు వెల్లడించారు.

Next Story

Most Viewed