- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీర్ పేట్ పెద్ద చెరువులో చేపలు మృతి
by Sridhar Babu |
కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి.

X
దిశ, మీర్ పేట్ : కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. బుధవారం ఉదయం అటు నుంచి వెళ్తున్న వాహనదారులు, పాదచారులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. చెరువులోని చేపలు కలుషిత నీటి వల్ల చనిపోయాయా లేకా ఇతర కారణాల వల్ల చనిపోయాయా అనే కోణంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేపలు మృతి చెంది నీటిపై తేలడంతో దుర్గంధం వెదజల్లుతుంది. అటు నుంచి వెళ్లే వాహనదారులు, వాకర్స్ వాసన భరించలేక పోతున్నారు. అధికారులకు ఉదయం సమాచారం అందించినా సాయంత్రం వరకు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారుల తీరు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- Tags
- Fish died
Next Story






