కరెంట్ షాక్ తగిలి రైతు మృతి

by Taduka Kalyani |

కరెంట్ షాక్ తో రైతు మృతి చెందాడు . ఈ సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని బాబు నాయక్ తాండలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

కరెంట్ షాక్ తగిలి రైతు మృతి
X

దిశ, బషీరాబాద్ : కరెంట్ షాక్ తో రైతు మృతి చెందాడు . ఈ సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని బాబు నాయక్ తాండలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జరుపల రాము నాయక్ (51) కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఇంటి అవసరాల కోసం బషీరాబాద్ వెళ్లి వచ్చి గ్రామ సమీపంలో ఉన్న ట్రాన్స్ఫరాను కరెంట్ రావడం లేదని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తెలిపారు.

Next Story