సద్దుల బతుకమ్మ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి

by Disha Web Desk 20 |
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి
X

దిశ, మహేశ్వరం : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో శివగంగ ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేసే అడుగుల్లో మహిళలు అడుగువేయాలన్నారు. 8ఏళ్ల సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీత ఆంద్యా నాయక్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేష్, ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ సుదీర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, దోమ శ్రీనివాస్ రెడ్డి, మిద్దింటి బాల్ రాజ్, దుడ్డు కృష్ణ యాదవ్, మునగపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story