మాకు పాఠశాలకు ఆలస్యం అవుతుంది..

by Disha Web Desk 20 |
మాకు పాఠశాలకు ఆలస్యం అవుతుంది..
X

దిశ ,దౌల్తాబాద్ : మండల పరిధిలోని సూరయపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సూరయపల్లి గేటు వద్ద బుధవారం కోస్గి వెళ్లే ప్రధాన రహదారి పై కూర్చొని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలకు, కాలేజీలకు, సమయానికి వెళ్ళలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల పై వెళ్లే దుస్థితి ఏర్పడిందని, అధికారులు స్పందించి వెంటనే సురయపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.


Next Story