పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి : కలెక్టర్​ అమోయ్​ కుమార్

by Disha Web Desk 13 |
పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి : కలెక్టర్​ అమోయ్​ కుమార్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్​డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు గాను పదేళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుండి అయినా పొందేందుకు అప్ డేట్ చేసుకున్న ఆధార్ ఉపయోగపడుతుందని వివరించారు.

పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సమీపంలో గల ఆధార్ కేంద్రాలలో అప్ డేట్ చేసుకోవాలని తెలిపారు. myaadhar.uidai.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో కూడా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని అన్నారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1947 నెంబరుకు కాల్ చేయవచ్చని, [email protected]@uidai.net.inకు మెయిల్ చేసి పూర్తి సమాచారం పొందవచ్చని అన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జి. ఎ. రాజ్ కుమార్, సహాయ మేనేజర్ ఎ.సత్యకళ, ఈ-సేవ జిల్లా మేనేజర్ నాగభూషణం, టీఎస్టిఎస్ డీ.ఎం సాయికుమార్ రెడ్డి, సీడీపీఓ స్వాతిశ్రీ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed