మునుగోడులో నామినేషన్ వేసిన చేవెళ్ల వాసి

by Disha Web Desk 20 |
మునుగోడులో నామినేషన్ వేసిన చేవెళ్ల వాసి
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలానికి చెందిన చొక్కంపేట ఆంజినేయులు అనే వ్యక్తి మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా స్వతంత్ర అభ్యర్థిగా చండూర్ ఎంఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు. అంతే కాకుండా అంబేద్కర్ ఎంతో శ్రమించి అందించిన ఓటు ఎంత అమూల్యమైనదో వివరిస్తూ రాష్ట్ర యువతను చైతన్యపరచడంకోసం పోటీ చేస్తున్నానని తెలిపారు.

Next Story

Most Viewed