మోసకారి సీఎం కేసీఆర్​ : డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్​ రెడ్డి

by Disha Web Desk 11 |
మోసకారి సీఎం కేసీఆర్​ : డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్​ రెడ్డి
X

దిశ, పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపిస్తానని ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయని మోసకారి సీఎం కేసీఆర్​ అని డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి అన్నారు. పరిగిలో జూనియర్​, అవుట్ సోర్సింగ్​ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మెకు శనివారం డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్​ రెడ్డి, కాంగ్రెస్​ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యలే ఈ మూడు దక్కించుకున్నారన్నారు.

జూనియర్​, అవుట్​ సోర్సింగ్​ పంచాయతీ కార్యదర్శుల ట్రైనింగ్​ పిరియడ్​ ఇతర రాష్టాల్లో కేవలం ఒక సంవతసరం మాత్రం ఉంటే మన రాష్టంలో మూడేళ్లకు పెంచడమేమిటి అని ప్రశ్నించారు. మూడేళ్లు దాటి నాలుగేళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోడం లేదన్నారు. కేవలం శ్రమ దోపిడి చేస్తూ చిరు ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్​, నాయకులు లాల్​ కృష్ణ ప్రసాద్​, టౌన్​ ప్రెసిడెంట్​ ఎర్రగడ్డపల్లి కృష్ణ, మున్సిపల్​ ప్లోర్​ లీడర్​ జరుపుల శ్రీనివాస్​ పవార్​, రాంచెంద్రయ్య, బద్రిగారి రాజ్​ పుల్లా రెడ్డి, రవి నాయక్​ , కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed