టీడీపీ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి: బక్కని నర్సింహులు

by Dishanational1 |
టీడీపీ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి: బక్కని నర్సింహులు
X

దిశ, మొయినాబాద్: తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందని టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా శనివారం మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైన మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కూడు, గూడు, గుడ్డ తెలుగుదేశం పార్టీకే దక్కిందని పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అధిక ప్రాధాన్య దించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. పటేల్ పట్టి వారి వ్యవస్థను రద్దు చేసి, రెండు రూపాయలు బియ్యం ఇచ్చి, పేదలకు పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబుకే దక్కిందని అన్నారు. అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కొమ్మిడి వెంకట్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ఎల్లన్న, యాదయ్య గౌడ్ బిక్షపతి యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, రాఘవరెడ్డి, ప్రవీణ్ విష్ణుకాంత్ రెడ్డి, రాజు గౌడ్, రాజు శ్రీనివాస్ చారి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed