కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించిన అమిత్ షా

by Disha Web Desk 11 |
కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించిన అమిత్ షా
X

దిశ, రాజేంద్రనగర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మైలార్ దేవుపల్లి కార్పొరేటర్, జిహెచ్ఎంసి కౌన్సిల్ బీజేపీ విప్ తోకల శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.ఖమ్మం లో జరిగిన భారీ బహిరంగ సభకు శ్రీనివాస్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఆయన 4 రోజుల పాటు అక్కడే మకాం వేసి సభా ఏర్పాట్లు, జన సమీకరణ, ప్రతి గ్రామం నుంచి బూత్ లెవెల్ కార్యకర్తలను ఒక్కతాటిపై తీసుకు వచ్చి సభను విజయవంతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినందుకు అమిత్ షా కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమవారం మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కేసీఆర్ పై రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికలు గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు సాగి వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.



Next Story

Most Viewed