RAMADAN: నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు షురూ.. నగరానికి కళొచ్చిందోచ్!

by Disha Web Desk 1 |
RAMADAN: నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు షురూ.. నగరానికి కళొచ్చిందోచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల్లో నగరంలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పాతబస్తీకి రంజాన్ శోభ వచ్చింది. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే ఈ నెలలో అత్యంత నిష్టలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఉంటారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఉపవాసం ఉండా ఇఫ్తార్‌తో దీక్షను విరమిస్తారు. క్రమం తప్పకుండా ఈ నెల మొత్తం ప్రతిరోజూ మసీదుకు నమాజ్ చేస్తారు. నిత్యం మసీదుల్లో ఖురాన్ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక ముస్లీంలలో నిరుపేదలకు అన్నదానాలతో పాటు వస్త్రదానాలు కూడా చేస్తారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో హైదరాబాద్ నగరంలో మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా.. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.


Next Story