కవిత సస్పెన్షన్ పై రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-02 10:13:20  IST  )

కవిత సస్పెన్షన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను దోచుకుందని అన్నారు. ఇందుకు కవిత వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు.

కవిత సస్పెన్షన్ పై రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: కవిత సస్పెన్షన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను దోచుకుందని అన్నారు. ఇందుకు కవిత వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోవడంలో వచ్చిన గొడవల వల్లనే కవిత ఆరోపణలు చేసిందన్నారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పార్టీ సీనియర్లు, కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. సీనియర్లతో చర్చించి అభిప్రాయం తీసుకున్న తరవాతనే సస్పెన్షన్ వేటు వేశారు.

Read More..

KCR ఫ్యామిలీ కొత్త డ్రామా.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శలు

Next Story