Rajiv Khel Ratna: కేంద్రం సంచలన నిర్ణయం.. మను బాకర్, గుకేశ్‌లకు ఖేల్‌రత్న పురస్కారం

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-02 09:57:07  IST  )

దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అందజేసే ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కాసేపటి క్రితం ప్రకటించింది.

Rajiv Khel Ratna: కేంద్రం సంచలన నిర్ణయం.. మను బాకర్, గుకేశ్‌లకు ఖేల్‌రత్న పురస్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అందజేసే ఖేల్ రత్న (Rajiv Khel Ratna) పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కాసేపటి క్రితం ప్రకటించింది. 2024-2025 సంవత్సరానికి గాను పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics)లో షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన మను బాకర్‌ (Manu Bakar), ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న గుకేశ్ దొమ్మరాజు (Gukesh Dommaraju)లు ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైనట్లుగా ప్రకటించారు. అదేవిధంగా హకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్ సింగ్‌ (Harmanpreet Singh), పారా ఒలింపిక్స్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) కూడా ఖేల్ రత్న పురస్కారం దక్కింది. వీటీతో పాటు మరో 32 మంది క్రీడాకారులకు అర్జునా అవార్డులను ప్రకటించారు. ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Next Story