తలసానిని మెచ్చుకున్న రాజాసింగ్

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-12 08:46:01  IST  )

ఎప్పుడూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడే రాజాసింగ్ తలసానిని ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది.

తలసానిని మెచ్చుకున్న రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడే రాజాసింగ్ తలసానిని ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. గోషామహల్‌లోని ముర్లిధర బాగ్ లో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తలసాని, మహమూద్ అలీతో కలిసి రాజాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కొంత లేట్ అయినా డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చాయన్నారు. తలసాని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారన్నారు. పక్కనే మరికొంత మంది ఇండ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని రాజాసింగ్ మంత్రిని కోరారు.

Also Read.

సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకు?

Next Story