రాజగోపాల్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలోఉద్రిక్తత

by Disha Web Desk 2 |
రాజగోపాల్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలోఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సమయంలో అక్కడే ఉన్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Next Story

Most Viewed