బుల్లెట్ బండిపై సెక్రటేరియట్‌‌కు రాజా సింగ్‌.. గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు

by Disha Web Desk 4 |
బుల్లెట్ బండిపై సెక్రటేరియట్‌‌కు రాజా సింగ్‌.. గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సెక్రటేరియట్‌కు శనివారం ఆయన బుల్లెట్ బండిపై వచ్చారు. అయితే లోనికి భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో గేట్ వద్దే కాసేపు వేచి చూశారు. లోనికి అనుమతించకపోవడంతో చేసేదేం లేక రాజాసింగ్ వెనుదిరిగారు. అయితే సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా రాజాసింగ్‌కు తలసాని మంత్రి పేషీ నుంచి ఆహ్వానం పంపారు. సెక్రటేరియట్‌లో మీటింగ్ అని చెప్పి లోనికి అనుమతించారా అని రాజాసింగ్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు కూడా లోనికి రాకూడదా అంటూ సర్కారుపై మండిపడ్డారు.

Also Read..

ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది? ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్



Next Story

Most Viewed