ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైల్వే పనులు స్లో : ఎంపీ అర్వింద్

by Disha Web Desk 4 |
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైల్వే పనులు స్లో : ఎంపీ అర్వింద్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గోవింద్ పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు తెలిపారు.

జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు రూ.67 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. రైల్వేల అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.4400 కోట్లతో రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్ల అధునికీకరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Next Story

Most Viewed