BRS పార్టీ టైటానిక్ పడవ లాంటిది.. రఘునందన్ రావు సెటైర్

by Disha Web Desk 2 |
BRS పార్టీ టైటానిక్ పడవ లాంటిది.. రఘునందన్ రావు సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కీలక నేతలంతా వరుసగా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతున్న పరిణామాలపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. శుక్రవారం ఆయన జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని అన్నారు. ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని విమర్శించారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకొని కారు దిగి వెళ్లిపోతున్నారంటేనే ఆ పార్టీ ఓటమి ఖాయమని అర్ధం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి గెలవడు అని తెల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. మెజార్టీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


Next Story