భజరంగ్ దళ్‌‌పై వ్యాఖ్యలు.. మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు షాక్!

by Disha Web Desk 4 |
భజరంగ్ దళ్‌‌పై వ్యాఖ్యలు.. మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్‌ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బజరంగ్​దళ్​ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. సంగ్రూర్​కు చెందిన ఆ సంఘం వ్యవస్థాపకుడు హితేష్​ భరద్వాజ్​ స్థానిక జిల్లా కోర్టులో ఖర్గే పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు సివిల్​ జడ్జి రమణదీప్​ కౌర్, ​ఖర్గేకు సమన్లు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ బజరంగ్​దళ్‌ని దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని సంగ్రూర్​ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ సంస్థలపై నిషేధం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొనడం రాజకీయ రగడకు తెరతీసింది. ఇది హిందూ దేవుడు హనుమంతుడిపై, ఆయన భక్తులపై జరిగిన దాడి అని బీజేపీ విమర్శలు గుప్పించింది.

Read More: కర్ణాటక కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని వారి డిమాండ్



Next Story