సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు.. సోషల్ మీడియాలో వైరల్

by Disha Web Desk 4 |
సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రజాపాల దరఖాస్తులకు సంబంధించి రోజుకో అంశం హాట్ టాపిక్ అవుతున్నది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లు సోనియా గాంధీ ఫోటోతో కూడిన ఓ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సోనియా గాంధీ కుమారుడిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశారు.

ఈ అప్లికేషన్లపై ఎటువంటి దరఖాస్తు నెంబర్ లేకపోవడంతో ఇది అకతాయిల పనిగా భావిస్తున్నారు. కాగా ఇటీవల హన్మకొండ జిల్లాలో శివుడు (దేవుడు) పేరుతో దరఖాస్తు చేసుకున్న ఘటన వెలుగు చూడగా ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల్లో వింత సమాధానాలతో ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇదంతా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు అకతాయిలు చేస్తున్న పనిగా అనుమానిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story