- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంత్రి పొన్నంకు నిరసన సెగ.. మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి పొన్నం ప్రభాకర్కు నిరనన సెగ తగిలింది. సిద్దిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం మంత్రి పొన్నం గర్భాలయానికి వెళ్లిన సమయంలో దర్శనాల క్యూలైన్లను నిలిపివేశారు. మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకునే వరకు దాదాపు గంట సమయం పట్టినట్లు సమాచారం. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులుయ తీవ్ర అసహనానికి గురవడంతో, మంత్రిని చూసి భక్తులు మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆలయ ఏఈవో శ్రీనివాస్ భక్తులకు 'అయిపోయింది.. అయిపోయింది' అని భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.