- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara 2026 : సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రముఖులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పలు ప్రముఖులు పాల్గొని శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పలు ప్రముఖులు పాల్గొని శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి అమ్మవారు దర్శనం చేసుకున్నారు.పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అమ్మ వార్లకు మొక్కలు చెల్లించారు.
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ వెన్ వుమెన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కు గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు అభివృద్ధి గురించి అందులోని విశేషాలు గురించి మంత్రి సీతక్క వివరించారు.






