తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్

by Disha Web Desk 2 |
తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని శుక్రవారం ప్రకటించారు. పీఎం మిత్ర పేరుతో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో ఈ మెగా టెక్స్ టైల్స్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వీటి ఏర్పాటుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయని, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పార్కుల ఏర్పాటు 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ ది వరల్డ్' కు గొప్ప ఉదాహరణ అవుతుందన్నారు. 5ఎఫ్ (ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాన్, ఫారిన్) దృష్టితో టెక్స్ టైల్స్ రంగాన్ని బలోపేతం చేస్తాయని ప్రధాని ట్వీట్ చేశారు.


Next Story