తెలంగాణకు ప్రధాని మోడీ.. డేట్ ఫిక్స్

by Disha Web Desk 4 |
తెలంగాణకు ప్రధాని మోడీ.. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. మార్చి 4 న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. 4వ తేదీన రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేయనున్నారు సంగారెడ్డి, అదిలాబాద్‌లలో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. మార్చి 4న ఆదిలాబాద్ లో, మార్చి 5న సంగారెడ్డిలో మోడీ పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్నికల కోడ్ కు ముందే ఈ పనులకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు కవర్ అయ్యేలా పటాన్ చెరు సమీపంలో బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మార్చి 4న జరగాల్సిన అమిత్ షా సభ రద్దు అయింది. ఇక, మార్చి రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న మోడీ టూర్ ఆసక్తికరంగా మారింది.






Next Story

Most Viewed