ఆక్రమణలు అడ్డుకోవడమే నేరం.. భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-08 08:57:56  IST  )

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో కీలక పరిణామం చోటచేసుకుంది.

ఆక్రమణలు అడ్డుకోవడమే నేరం.. భద్రాచలం ఆలయ ఈవోపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో కీలక పరిణామం చోటచేసుకుంది. భద్రచలం ఆయన ఈవో రమాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు ఇవాళ దాడికి పాల్పడ్డారు. అయితే, ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఆక్రమణలు అడ్డుకున్న పాపానికి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నంకు వెళ్లగా.. ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఉన్న ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడం సంచలనంగా మారింది.

Next Story