- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల ఆధీనంలోకి సభా ప్రాంగణం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. భైంసా ఎఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సభా స్థలి వద్ద పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. సభ స్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టుచేసి ఠాణాకు తరలించారు. సభా స్థలికి వెళ్లే మార్గంలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ కాస్తున్నారు.
Next Story






