- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మంత్రి KTRని కలిసిన ప్రవళిక కుటుంబసభ్యులు (వీడియో)
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణమని అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రిని కోరారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను డీజీపీ ద్వారా తెలుసుకున్నానన్నారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని అని విధాలా ఆదుకుంటామన్నారు. ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి కేటీఆర్ ప్రవళిక కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.
Next Story