బాబా రాందేవ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
బాబా రాందేవ్ పై కేఏ పాల్  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆధ్యాత్మిక వేత్త, యోగా గురు బాబా రాందేవ్ పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్ రూ.2 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ పీస్ మిషన్ లో ఉన్నప్పుడు తాను లక్షల కోట్ల రూపాయలను పేద ప్రజల సంక్షేమం కోసం పంచి పెట్టానని చెప్పుకొచ్చారు. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను ఆపానని చెప్పారు. పదో తరగతి ఫెయిల్ అయిన తాను ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అద్భుతంగా ఇంగ్లీష్ లో ఉపన్యాసాలు ఇవ్వగలుతున్నానని అన్నారు. తాను ఓ బీసీ వ్యక్తినని, తాను ఓ దళిత మహిళను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తాను కుల మతాలకు వ్యతిరేకమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed