రేపు ప్రగతి భవన్‌(ప్రజాభవన్‌)లో ప్రజాదర్భార్ : CM రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-07 09:08:13  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.

రేపు ప్రగతి భవన్‌(ప్రజాభవన్‌)లో ప్రజాదర్భార్ : CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఇకపై ప్రగతి భవన్ పేరును జ్యోతిరావుపూల్ ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా భవన్‌లో రేపు ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రజలు పెద్ద ఎత్తున రావాలన్నారు. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెను బద్దలు గొట్టామన్నారు. ప్రజలు ప్రగతిభవన్‌కు రావొచ్చన్నారు. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులమన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభయ హస్తం ఫైల్ ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామకం కల్పించే ఫైల్ పై రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు.

Next Story