బ్రేకింగ్: MLC కవిత విచారణ వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: MLC కవిత విచారణ వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరువుతున్న వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల, ఫ్లెక్సీలు కలకలం రేపాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ద్వారా బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందంటూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. కాగా, ఈ పోస్టర్లలో బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు శనివారం ప్రత్యక్షమయ్యాయి.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు ఉండగా.. వీరంతా రైడ్స్ జరగగానే బీజేపీలో చేరడంతో వీరిపై ఉన్న అవినీతి మరకలు తొలిగిపోయాయంటూ అర్థం వచ్చేలా ఉన్న పోస్టర్లు వెలుగు చూశాయి.

కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు, పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నిజమైన రంగులు ఎప్పటికి వెలసిపోవు అంటూ కొటేషన్‌తో వెలిసిన ఈ పోస్టర్లు కవిత ఈడీ విచారణ వేళ ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా ఈ పోస్టర్ల చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్‌తో ఉన్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి.


Read more:

సెన్సేషనల్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రధారి ఎవరో బయటపెట్టిన ఈడీ .సౌత్ గ్రూప్ వాట్సప్ చాట్ డీ కోడ్ చేయడంతో బాగోతం బట్టబయలు .MLC కవితపై ఆ సెక్షన్ ప్రయోగించి అరెస్ట్..?

Next Story

Most Viewed