టీఎస్‌పీఎస్సీ‌పై పోస్ట్ కార్డు ఉద్యమం

by Disha Web Desk 9 |
టీఎస్‌పీఎస్సీ‌పై పోస్ట్ కార్డు ఉద్యమం
X

దిశ తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీ‌ఎస్సీ ఇష్యూ‌లో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టనున్నది. బోర్డు అవకతవకలపై చర్యలు తీసుకొని వెంటనే బోర్డును రద్దు చేయాలని కోరుతూ.. రాష్ట్రపతికి పోస్ట్ ద్వారా ఉత్తరం పంపనున్నారు. ఎన్‌ఎస్‌యూ‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ సారథ్యంలో కార్యవర్గ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం అబిడ్స్‌లోని పోస్ట్ ఆఫీస్‌లో ఉత్తరాలు పంపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు వీలైనంత ఎక్కువ ఉత్తరాలు పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed