ఈ నెల చివర్లో ఆ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా జాయినింగ్స్: పొంగులేటి

by Disha Web Desk 19 |
ఈ నెల చివర్లో ఆ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా జాయినింగ్స్: పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ నుంచి చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల చివర్లో వరుస జాయినింగ్స్​ఉంటాయన్నారు. సోమవారం మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలు వేర్వేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. కాంగ్రెస్​పార్టీలోకి వచ్చే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే అంటూ ఇద్దరు నేతలు భట్టిని కోరారు. కేసీఆర్‌ను ఢీ కొట్టడంపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇరువురు నేతలు భట్టికి వివరించారు.

ప్రజల సమస్యలపై ఫోకస్​ పెడుతూనే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భట్టి.. ఇద్దరి నేతలను కోరారు. కొల్లాపూర్​సభ తర్వాత ఒక వైపు ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తూనే, మరోవైపు రాష్ట్రమంతటా చేరికలపై ఫోకస్​పెడతామని పొంగులేటి, జూపల్లి భట్టికి వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​కు మద్ధతు పెరిగిందని.. కేసీఆర్, మోడీలు ఇక ఇళ్లకే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, పేదల కష్టాలు తీరుతాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed