- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో పొంగులేటి చేరిక.. క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి..
బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఖమ్మం రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఖమ్మం రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. హత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందని.. ఇందుకోసం కేసీఆర్ వ్యతిరేక శక్తులు అన్ని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.
అలాగే మాజీ ఎంపీ పొంగులేటి సిద్ధాంతం మంచిదని.. ఆయన కాంగ్రెస్లో చేరడానికి స్వాగతిస్తున్నాను.. కానీ పోంగులేటి బీజేపీలోకి వెళ్లాలనుకునే నిర్ణయం మంచిది కాదని అన్నారు. అలాగే ఇప్పటికే బీజేపీలో చేరిన వారు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దీంతో స్వయానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే.. పొంగులేటీ బీజేపీలో చేరాలనుకోవడం మంచి సిద్ధాంతం కాదని అనడంతో.. పొంగులేటీ బీజేపీలో చేరతాడు అనే వార్తలకు బలం చేకూరుంది.






