గడువు మరో మూడు రోజులే.. ఆ తర్వాత ఇక బాదుడే

by Disha Web Desk 4 |
గడువు మరో మూడు రోజులే..  ఆ తర్వాత ఇక బాదుడే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్ చేసేలా పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు మరో 3 రోజులే మాత్రమే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ మూడు రోజుల్లో చెల్లించకపోతే ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు మార్చి 31వరకు ట్రాఫిక్ పోలీసులు గడువు విధించారు.

మరో మూడు రోజుల్లో ఆ గడువు ముగియనుంది. అయితే మరోసారి గడువు పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని, ఈ మూడు రోజుల్లో రాయితీపై చెల్లించుకోవచ్చని స్పష్టం చేశారు. గడువు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని, అలాంటి ఆలోచన లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై పోలీసులు ప్రకటించిన రాయితీకి భారీ స్పందన వస్తోంది. మార్చి 1 నుంచి రాయితీ ప్రకటించగా.. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల చలాన్లు చెల్లించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం చేకూరింది.



Next Story

Most Viewed