'కేసీఆర్‌కు తొత్తులుగా పోలీసులు'

by Rajesh |
కేసీఆర్‌కు తొత్తులుగా పోలీసులు
X

దిశ, భైంసా : పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అందుకే పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. తాము శాంతియుతంగా సభలు, ర్యాలీలు నిర్వహించుకుంటామంటే తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ఆరోపించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభతో పాటు, ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతులు కోరామని అయినా పోలీసులు నిరాకరించారన్నారు. ఎన్నిమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తిప్పుకున్నారే తప్ప అనుమతులు ఇవ్వలేదన్నారు. తీరా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. గత నాలుగు విడతలుగా యాత్ర కొనసాగిస్తున్నామని 5వ విడత యాత్రకు అడ్డంకులు సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా సభ నిర్వహించే తీరుతామన్నారు. మధ్యలో పోలీసులు వచ్చి రమాదేవిని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు.

Next Story

Most Viewed