BREAKING: చరిత్ర తిరగరాసిన పోచారం.. బాన్సువాడలో ఘన విజయం

by Satheesh |
BREAKING: చరిత్ర తిరగరాసిన పోచారం.. బాన్సువాడలో ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. బాన్సువాడలో శ్రీనివాస్‌రెడ్డి 23,582పైగా ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపుపొందారు. ఈ గెలుపుతో పోచారం శ్రీనివాస్ రెడ్డి చరిత్ర తిరగరాశారు. ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన తర్వాత ఎన్నికల్లో ఎవరూ గెలుపొందలేదు. తెలుగు రాష్ట్రాల్లో స్పీక‌ర్‌గా పని చేసిన ఎవరూ మళ్లీ అసెంబ్లీ గ‌డ‌ప తొక్కలేదు. ఈ సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని తాజాగా పోచారం బ్రేక్ చేశారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన మధుసూదనా చారి సైతం ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed