ముగిసిన పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం

by Disha Web Desk 19 |
ముగిసిన పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 6 గంటల పాటు ఈడీ అధికారుల బృందం పైలెట్ రోహిత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. వివిధ అంశాలపై రోహిత్ రెడ్డిని ప్రశ్నించింది. ఈడీ విచారణ అనంతరం పైలెట్ మీడియాతో మాట్లాడారు. ఈడీ అడిగిన ఫార్మాట్‌లో వివరాలు సమర్పించేందుకు.. మరికొంత సమయం కావాలని ఈడీని కోరినట్లు పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. విచారణలో అధికారులు తన బయోడేటా గురించి వివిధ అంశాలపై ప్రశ్నించారని పేర్కొన్నారు. ఏ కేసుకు సంబంధించి విచారణకు తనను పిలిచారో మాత్రం చెప్పలేదని వెల్లడించారు. నా వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిపారు. మనీలాండరింగ్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ గురించి ప్రశ్నించలేదని చెప్పారు. విచారణ సమయంలో ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. రేపు ఉదయం 10.30 కు మళ్లీ విచారణకు రమ్మన్నారని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు.

Next Story