- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశ్రామిక వ్యర్థాల విడుదలపై హైకోర్టులో పిల్.. డిస్మిస్ చేసిన ధర్మాసనం
by Kema Shiva Kumar |
గోదావరి నది, ఉప నదులు, వాగులు కాలువల్లోకి శుద్ధి చేయని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని వెంటనే నిరోధించడానికి తగిన చర్యలు చెపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నది, ఉప నదులు, వాగులు కాలువల్లోకి శుద్ధి చేయని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడాన్ని వెంటనే నిరోధించడానికి తగిన చర్యలు చెపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు ఆ పిల్ను హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి బుధవారం దాఖలు చేశఆరు. నదుల పర్యవేక్షణ, నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించాలని, కాలుష్య స్థాయిలను బహిరంగంగా బహిర్గతం చేయాలని ప్రతివాదులను ఆదేశించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్విరాన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర, కేంద్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఎంఏయూడీ, ఇండస్ట్రీ కామర్స్ విభాగాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని పిల్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
Next Story






