- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ ముందుకు బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ.. ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ఐబీ, సిట్, కౌంటర్ఇంటలిజెన్స్విభాగాల్లో పని చేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై చర్చించినట్టు తెలిసింది.
బండి సంజయ్ ఫోన్లే అత్యధికంగా ట్యాప్
కేసీఆర్ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ఫోన్లనేఅత్యధికంగా ట్యాప్చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్ట్యాపింగ్లో సిట్ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కావడం గమనార్హం. మరో వైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్సంతోష్ఫోన్ను సైతం ట్యాప్చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై దిల్కుషా గెస్ట్హౌజ్వద్ద నిరసన చేపట్టేందుకు కాషాయ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు.
విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది సైతం
ఫోన్ట్యాపింగ్కేసులో గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటుసమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని బండి సంజయ్ సిట్కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరుకానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ప్రభుత్వం ట్యాపింగ్చేసిందని గుర్తించారు.






